Advertisement

  • ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కొత్త కమిషనర్‌గా రమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కొత్త కమిషనర్‌గా రమేష్ కుమార్

By: chandrasekar Fri, 03 July 2020 4:22 PM

ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కొత్త కమిషనర్‌గా రమేష్ కుమార్


ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్‌ను నియమాకం జరిగింది. ఈ పదవిలో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పి.రమేష్ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఓకే చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమేష్ ‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె గురువారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ కుమార్ 1986 బ్యాచ్‌ అధికారి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా రమేష్ కుమార్ పని చేసి 2017లో రిటైర్ అయ్యారు.

కడప జిల్లాకు చెందిన రమేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమితలవుతున్న తొలి వ్యక్తి. చాలా కాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీంతో ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఓకే చెప్పారు.

Tags :
|

Advertisement