Advertisement

  • డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఆపివేయాలని కోరుతూ రకుల్ పిటిషన్

డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఆపివేయాలని కోరుతూ రకుల్ పిటిషన్

By: chandrasekar Fri, 18 Sept 2020 3:03 PM

డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఆపివేయాలని కోరుతూ రకుల్ పిటిషన్


సినీ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిటిషన్‌లో కోర్టును కోరింది. జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీం కోర్టు స్పందించిందని తెలిపింది. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని జస్టిస్‌ నవీన్‌ చావ్లా తెలిపారు. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలకు హైకోర్టు సూచించింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియా లీలలు వెలుగు చూశాయి. సుశాంత్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్న రియా చక్రవర్తి అరెస్టుతో డ్రగ్స్‌ కుంభకోణం వెలుగు చూసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచార‌ణ‌లో సుమారు 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉందని రియా విచారణలో తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ తనతో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రియా విచారణలో ఎవరి పేర్లు చెప్పలేదని వార్తలు వచ్చాయి. మరోసారి విచారణలో పేర్లు చెప్పిందని, ఇందులో రకుల్‌, సారా పేర్లు ఉన్నాయని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఇలా మీడియాలో విధవిధమైన వార్తలు వస్తున్నాయి.

Tags :
|

Advertisement