Advertisement

  • సస్పెన్షన్ కు గురి అయిన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

సస్పెన్షన్ కు గురి అయిన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

By: Sankar Tue, 22 Sept 2020 10:35 AM

సస్పెన్షన్ కు గురి అయిన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్


పార్లమెంట్‌ ఆవరణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది... తమ సస్పెన్షన్‌ను వ్యతిరేకంగా పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం దగ్గర సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎంపీలు సోమవారం నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. రాత్రి కూడా అక్కడే ఉన్నారు ఎంపీలు..

అయితే, ఇవాళ ఉదయం ఎంపీల దగ్గర ప్రత్యక్షమయ్యారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌సింగ్.. అంతే కాదు.. నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీల కోసం తానే స్వయంగా టీ తీసుకొని వచ్చారు. కాగా, వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపే క్రమంలో ఆదివారం రోజు సభలో ఆందోళన చేపట్టిన 8 మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, రిపూన్ బోర, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, సీపీఎం నుంచి కేకే రగేశ్, ఎలమరన్ కరీం, సింగ్, ఆప్ నుంచి సంజయ్ సింగ్ ఉన్నారు.

సస్పెన్షన్‌కు గురైన 8 మంది ఎంపీలు.. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి తనపై నిరసన వ్యక్తం చేసి సస్పెన్షన్‌కు గురైన ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ టీ తీసుకెళ్లడం ఆసక్తిగా మారింది.

Tags :
|
|

Advertisement