Advertisement

  • ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన రాజ్‌దీప్‌ సర్దేశాయి

ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన రాజ్‌దీప్‌ సర్దేశాయి

By: Sankar Sat, 01 Aug 2020 2:45 PM

ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన రాజ్‌దీప్‌ సర్దేశాయి



ఏపీలో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి ...ప్రతి రోజు పదివేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి ..అదే స్థాయిలో టెస్ట్ లు కూడా ఏపీలో జరుగుతున్నాయి ..అయితే కరోనా కట్టడిపై ఏపీ ప్రభుత్వం చేబడుతున్న చర్యలను మెచ్చుకున్నారు ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయి..కేసులు పెరుగుతున్నా.. ఏపీ సర్కార్‌ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయం అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వైరస్‌ కట్టడి కోసం ఏపీ అనుసరిస్తోన్న పద్దతి ప్రశంసనీయం అన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా.. ఏపీలో కరోనా లెక్కలను దాచడంలేదన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలన్నారు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్‌ చేశారు. గతంలో ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించనప్పుడు కూడా రాజ్‌దీప్‌.. క్లిష్ట సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను తగ్గించడం లేదు. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 31 నాటికి రాష్ట్రంలో 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ముందంజలో ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|

Advertisement