Advertisement

  • యూఏఈ బయల్దేరిన ఆ రెండు ఐపీయల్ టీములు ..పిపిఈ కిట్లు , మాస్క్ లతో అత్యంత జాగ్రత్తగా ప్రయాణం

యూఏఈ బయల్దేరిన ఆ రెండు ఐపీయల్ టీములు ..పిపిఈ కిట్లు , మాస్క్ లతో అత్యంత జాగ్రత్తగా ప్రయాణం

By: Sankar Fri, 21 Aug 2020 05:30 AM

యూఏఈ బయల్దేరిన ఆ రెండు ఐపీయల్ టీములు ..పిపిఈ కిట్లు , మాస్క్ లతో అత్యంత జాగ్రత్తగా ప్రయాణం


ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈకి గురువారం నుంచి టోర్నీలోని టీమ్స్‌ బయల్దేరి వెళ్తున్నాయి. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. కనీసం నెల రోజుల ముందు టీమ్స్‌ని అక్కడికి పంపాలని ఫ్రాంఛైజీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. దాంతో.. ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్,రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లని అక్కడికి పంపాయి.

మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరాన్ని పాటిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు యూఏఈకి బయల్దేరగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రికెటర్లు మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ ఏకంగా పీపీఈ కిట్లు ధరించి మరీ యూఏఈ విమానం ఎక్కారు. రాజస్థాన్ టీమ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్, ఓపెనర్ రాబిన్ ఉతప్ప తదితరులు పీపీఈ కిట్లు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

యూఏఈకి ఆటగాళ్లని పంపే ముందు రెండు సార్లు వారికి కరోనా వైరస్ పరీక్షల్ని ఫ్రాంఛైజీలు నిర్వహించనుండగా.. యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత ఒకటి.. 14 రోజుల క్వారంటైన్‌లో రెండు సార్లు పరీక్షలు చేయనున్నారు. మొత్తంగా.. టోర్నీ ఆరంభానికి ముందు ఐదు సార్లు ప్రతి క్రికెటర్‌కి కరోనా టెస్టులు చేస్తారు. అన్నింటిలోనూ నెగటివ్ వచ్చిన వారిని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చి.. టోర్నీ ముగిసే వరకూ ఆ బబుల్‌ నుంచి వారిని వెలుపలికి అనుమతించరు.

అయితే యూఏఈ లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐపీయల్ నిర్వహణపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది..ఇప్పటికే క్రికెట్ మ్యాచ్ లు లేక దాదాపు ఆరు నెలలకుపైగా అవుతుండటంతో ఎప్పుడెప్పుడు ఐపీయల్ స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Tags :
|
|

Advertisement