మ్యాచ్ ఫినిషర్గా మారనున్నట్లు తెలిపిన రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ డేవిడ్ మిల్లర్
By: chandrasekar Tue, 15 Sept 2020 09:43 AM
మ్యాచ్ ఫినిషర్గా
మారనున్నట్లు తెలిపిన రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తెలిపాడు. తాను
కూడా ధోని ఆదర్శంగా మ్యాచ్లను ఆడి ఫినిష్ చేయనున్నట్లు తెలిపాడు. చెన్నై సూపర్
కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తరహాలో తాను కూడా ఐపీఎల్ 2020 సీజన్లో
మ్యాచ్లను ముగించాలని ఆశపడుతున్నట్లు రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ డేవిడ్ మిల్లర్
వెల్లడించాడు. ఐపీఎల్ 2019 సీజన్ వరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఆడిన
డేవిడ్ మిల్లర్ని ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆటగాళ్ల వేలంలో రూ. 75
లక్షలకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దాంతో కొత్త టీమ్లో
ఆరంభంలోనే సత్తాచాటాలని డేవిడ్ మిల్లర్ ఉవ్విళ్లూరుతున్నాడు. యూఏఈ వేదికగా
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా సెప్టెంబరు 22న
చెన్నై సూపర్ కింగ్స్తో షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.
దీనికోసం తాను ధోని
మాటలను వీక్షించినట్లు అందులో ధోని వ్యూహాన్ని అనుకరించనున్నట్లు తెలిపాడు. ఈ
నేపథ్యంలో తొలి మ్యాచ్ నుంచే ధోనీ తరహాలో టీమ్ ఫినిషర్ బాధ్యతలు తీసుకోవాలని
డేవిడ్ మిల్లర్ ఆశిస్తున్నాడు. ధోనీ ఆటని చూడటం ద్వారా ఇప్పటికే ఫినిషింగ్
స్కిల్స్ని తాను నేర్చుకున్నానని ఈ దక్షిణాఫ్రికా హిట్టర్ చెప్పుకొచ్చాడు.
ఫినిషర్గా మ్యాచ్లను ధోనీ ముగించే విధానం నాకు బాగా నచ్చుతుంది. మ్యాచ్ ఎలాంటి
స్థితిలో ఉన్నా కామ్గా ఉండే ధోనీ పరిస్థితులు అన్నీ తన కంట్రోల్లో ఉన్నట్లు
క్రీజులో వ్యవహరిస్తాడు. నేను కూడా ధోనీలా రాజస్థాన్ రాయల్స్ టీమ్కి మ్యాచ్లను
ముగించాలని ఆశిస్తున్నా అని డేవిడ్ మిల్లర్ వెల్లడించాడు. ఐపీఎల్ 2019 సీజన్లో
కనీసం ప్లేఆఫ్కి కూడా రాజస్థాన్ రాయల్స్ అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.