Advertisement

  • అనారోగ్య౦తో రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ మృతి...

అనారోగ్య౦తో రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ మృతి...

By: chandrasekar Tue, 17 Nov 2020 4:03 PM

అనారోగ్య౦తో రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ మృతి...


రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ (72) మృతి చెందారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి అయిన ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం మంగళవారం సంతాపదినంగా ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం వరకు దించడంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసారు.

మంత్రి భన్వర్‌ లాల్‌ మరణంపట్ల రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సంతాపం తెలిపారు. 1980 నుంచి తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని గుర్తు చేసుకున్నారు. ఈ కష్టకాలం నుంచి ఆయన కుటుంబం కోలుకోవాలని, దేవుడు వారికి ఆ శక్తి ఇవ్వాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. ‘రాజస్థాన్‌కు సేవ చేయడం పట్ల మక్కువ చూపిన అనుభవజ్ఞుడైన నాయకుడు భన్వర్ లాల్ మేఘవాల్. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం’ అని ట్విట్టర్‌లో తెలిపారు.

Tags :
|

Advertisement