కీలక మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న రాయల్స్
By: Sankar Sat, 31 Oct 2020 08:36 AM
నిన్న జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మీద చాల జట్లు ఆశలు పెట్టుకున్నాయి..దాదాపు నాలుగు జట్లు ఆ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు గెలవాలని కోరుకున్నాయి..వారి ఆశలకు తగ్గట్లు రాజస్థాన్ జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో పంజాబ్ పై విజయం సాధించి తాను ప్లే ఆఫ్ రేస్ లో ఉండటమే కాకుండా తనతో పాటు మరొక మూడు టీం లను కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉంచి పోరును రసవత్తరం చేసింది...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్... 4 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. గేల్ మరోసారి దుమ్ములేపాడు. 63 బంతుల్లో 99రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 46 పరుగులతో రాణించాడు. పూరన్ ఫర్వాలేదనిపించాడు. దీంతో రాజస్థాన్కు ముందు మంచి టార్గెట్ పెట్టింది.కింగ్స్ బౌలింగ్ చూస్టుగే రాజస్థాన్ కు చేజింగ్ కష్టమే అని భావించారు..
అయితే పంజాబ్ నిర్దేశించిన టార్గెట్ను 17 ఓవర్లలోనే చేధించింది రాజస్థాన్. బెన్ స్టోక్స్ 26 బంతుల్లో 50 పరుగుల చేయగా... శాంసన్ 25 బంతుల్లో 48 పరుగులు చేశాడు. రాబిన్ ఉతప్ప 23 బంతుల్లో 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్, బట్లర్ రాణించడంతో... 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓడినా పంజాబ్కు ప్లే ఆఫ్ ఆశలు పదిలంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్తో విజయం సాధించాలి. అంతేకాదు రన్ రేటు కూడా మెరుగ్గా ఉండాలి. అప్పుడే ప్లే ఆఫ్ చేరుకుంటుంది.