కరోనాను నుంచి బయట పదిన రాజమౌళి
By: chandrasekar Wed, 12 Aug 2020 8:46 PM
ప్రముఖ దర్శకుడు రాజమౌళి
తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
నిర్ధారణ అయిందని గత నెల 30న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కరోనా సోకడంతో
డాక్టర్ల సలహా మేరకు ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉంటూ కరోనాకు చికిత్స
తీసుకున్నారు. తాజాగా రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులతకు నిర్ధేశించిన గుడవు
పూర్తి కావడంతో మరోసారి కరోనా టెస్టు జరిపిస్తే తాజాగా అందరికీ కరోనా పరీక్షల్లో
నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
రీసెంట్గా అమితాబ్
బచ్చన్తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. అటు నటి సుమలత, కమెడియన్
కమ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.
మరోవైపు రాజమౌళి ప్లాస్మా
దానం గురించి చెబుతూ డాక్టర్లు తమను మూడు వారాలు వెయిట్ చేయమని చెప్పినట్టు
చెప్పుకొచ్చారు. ఈ లోగా తన శరీరంలో యాండీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం
చేయడానికి ముందుకొస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్లతో ఆర్ఆర్ఆర్ సినిమా
తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కరోనా బారిన పడిన సంగతి
తెలిసిందే.