నివర్ తుపాను ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వానలు...
By: chandrasekar Fri, 27 Nov 2020 10:12 AM
రాష్ట్రంలోని పలు
జిల్లాల్లో నివర్ తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బుధవారం అర్ధరాత్రి
తర్వాత నివర్ తుఫాను పుదుచ్చేరిలో తీరాన్ని తాకింది. దీంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అతి తీవ్ర తుఫాను నుంచి
వాయుగుండగా మారిన నివర్, ఇవాళ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ
శాఖ ప్రకటించింది.
దీని ప్రభావంతో ఇవాళ, రేపు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి
నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. నిన్న ఖమ్మం, భద్రాద్రి
కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో మోస్తరుగా వానలు కురిశాయి.
Tags :
rains in |
today |