ఇంగ్లాండ్, వెస్టిండీస్ మ్యాచ్కు వర్షం కారణంగా అంతరాయం
By: chandrasekar Thu, 09 July 2020 5:39 PM
సౌతాంప్టన్ జరగవలసిన
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టుకు వర్షం కారణంగా
అంతరాయం కలిగింది. సౌతాంప్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30
గంటలకు ప్రారంభంకావాల్సి ఉంది.
గత కొద్దిరోజుల నుంచి
సౌతాంప్టన్లో వాతావరణం చల్లగా ఉంటున్నది. శుక్రవారం వరకు అప్పుడప్పుడూ చిరుజల్లులు
పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ
తెలిపింది. తొలి రెండు రోజుల సౌతాంప్టన్లో వర్ష సూచన ఉన్నది.
చిరుజల్లులు
కురుస్తుండటంతో మ్యాచ్ టాస్కు అంతరాయం ఏర్పడింది. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్
రూమ్కు వెళ్లారు.
కరోనా మహమ్మారి వల్ల ఆగిన
అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ప్రారంభంకాబోతున్నది. 117 రోజుల విరామం
తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ను టీవీల్లో చూడబోతున్నారు.
Tags :
rain |
disrupts |
england |