రైల్వే ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ..ఇక నుంచి యూజర్ చార్జీలు వసూలు
By: Sankar Fri, 18 Sept 2020 10:01 AM
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ట్రైన్ టికెట్తో పాటు యూజర్ చార్జీలు కూడా వసూలు చెలయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ సంధర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేయబోతున్నామని అన్నారు. ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. కానీ ఈ చార్జీలతో కలుపుకుని ట్రైన్ టికెట్ ధర మరింత పెరిగనుందని తెలిపారు. అంతేకాకుండా ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని అన్నారు.
దేశంలో ఉన్న 7వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో ఈ చార్జీలను వసూలు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా రైల్వే లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం గమనార్హం.