Advertisement

రైలింజన్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి

By: Sankar Wed, 22 July 2020 4:00 PM

రైలింజన్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి



వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రైలింజన్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పెయింటింగ్ పనులు చేస్తున్న ఉద్యోగులపైకి రైలింజన్ దూసుకురావడంతో ముగ్గురు రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసినది వంతెనపై ఈ ఘోరం చోటుచేసుకుంది.

రైల్వే ఉద్యోగులు బ్రిడ్జిపై పెయింటింగ్ వర్క్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న రైలింజన్ రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది

ఆ సమయంలో 12 మంది పెయింటింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. రైలింజర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నవీన్ (34), షంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. బ్రిడ్జిపై పనులు చేస్తున్న సమయంలో రైలింజన్ రావడంతో అందరూ ఒకేసారి తప్పుకునే వీల్లేక ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement