యాదాద్రి రైల్వే స్టేషన్గా మారనున్న రాయగిరి రైల్వే స్టేషన్
By: chandrasekar Tue, 22 Sept 2020 02:33 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన
యాదాద్రికి సమీపంలో ఉండే రాయగిరి రైల్వే
స్టేషన్ ఇకముందు యాదాద్రి రైల్వే స్టేషన్గా మారబోతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య
రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాజీపేట్ సెక్షన్ మధ్యలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్
పేరును యాదాద్రి రైల్వే స్టేషన్గా మారుస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన
విడుదల చేసింది.
సౌత్ సెంట్రల్ రైల్వే ఈ
నెల 18 నుంచే
ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తన ప్రకటనలో తెలిపింది. యాదాద్రికి ఐదు కిలోమీటర్ల
దూరంలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్కు యాదాద్రి పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి
నుంచో ఉంది.
రైల్వే స్టేషన్ పేరు
మార్చడంతో పాటు కేవలం మూడు నాలుగు రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్లో మరిన్ని
రైళ్లను ఆపాలని గతంలో అనేక మంది డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ ప్రజలకు సేవలందించే
ఎంఎంటీఎస్ రైళ్లను యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు పొడిగించే ప్రతిపాదన కూడా
చాలాకాలం నుంచి ఉంది.