ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేసిన రాహుల్
By: chandrasekar Tue, 11 Aug 2020 10:40 AM
కరోనా వైరస్ మహమ్మారి
విజృంభణ కారణంగా ఈసారి లీగ్ యూఏఈలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇండియన్
ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంలో
ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయగా కింగ్స్
ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ సోమవారం అదే పనిచేశాడు.
కాగా, ఆరు
నెలలుగా మైదానానికి దూరమైన ఆటగాళ్లు ప్రస్తుతం ఫిట్నెస్, ప్రాక్టీస్పై
దృష్టి పెట్టారు. `నా చెవులకు సంగీతం వినబడుతున్నది`అని
రాహుల్ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేశాడు. దుబాయ్లో జరుగనున్నలీగ్ కోసం ఆటగాళ్లంతా
ఆతృతగా ఎదురుచూస్తుంటే ఫ్రాంచైజీలు
ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నాయి. మరోవైపు బీసీసీఐ లీగ్ స్పాన్సర్ కోసం
వెతుకుతూనే ఉంది.