ప్రధానికి మోడీకి సైన్యం కంటే తన ఇమేజ్ మీదనే ఎక్కువ దృష్టి ...రాహుల్ గాంధీ
By: Sankar Thu, 08 Oct 2020 10:05 PM
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. ఆయన తన ఇమేజ్ను మాత్రమే కాపాడుకుంటారని, సైన్యాన్ని కాదని విమర్శించారు. రూ.8400 కోట్ల వ్యయంతో వీవీఐపీ విమానాల కొనుగోలుపై రాహుల్ మండిపడ్డారు.
సైనికులకు అవసరమైన వాటి కోసం కాకుండా వీఐపీ విమానాల కోసం నిధులను ఖర్చుచేయడాన్ని దుయ్యబట్టారు. ‘ప్రధాని తన కోసం రూ.8400 కోట్ల విలువైన విమానాలు కొనుగోలు చేశారు. ఈ నిధులతో సియాచిన్, లఢక్ సరిహద్దుల్లో ఉన్న సైన్యం కోసం అవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు’ అని రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు.
ప్రధాని తన ఇమేజ్ మాత్రమే పట్టించుకుంటారు, సైన్యాన్ని కాదు అని అందులో విమర్శించారు. అత్యంత క్లిష్ట వాతావరణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు అవసరమైన వేడిని కలిగించే దుస్తులు, బూట్లు, ఇతర ఉపకరణాల కొరతకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని దీనికి జత చేశారు.