మెల్బోర్న్ హానర్స్ బోర్డు లో రెండోసారి పేరు లిఖించుకున్న రహానే...
By: Sankar Wed, 30 Dec 2020 8:17 PM
టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ ఆజింక్య రహానె మరో అరుదైన ఘనత సాధించాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన రహానె తన పేరు రాయించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో 112 పరుగులతో చెలరేగిన రహానె భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్ బోర్డులో రహానె పేరు చేర్చడం ఇది రెండోసారి కావడం విశేషం.
ప్రతిష్టాత్మక హానర్స్ బోర్దులో ఆస్ట్రేలియా గ్రౌండ్ సిబ్బంది తన పేరును చెక్కే వీడియో క్లిప్ను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. 2014లో తొలిసారి రహానె పేరును హానర్స్ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్లో రహానె 147 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇదే మైదానంలో 169 చేసి హానర్స్ బోర్డులో పేరు దక్కించుకున్నాడు.