Advertisement

  • తొలి టెస్ట్ లో కోహ్లీ రన్ అవుట్ పై స్పందించిన రహానే

తొలి టెస్ట్ లో కోహ్లీ రన్ అవుట్ పై స్పందించిన రహానే

By: Sankar Fri, 25 Dec 2020 7:02 PM

తొలి టెస్ట్ లో కోహ్లీ రన్ అవుట్ పై స్పందించిన రహానే


అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయినా విషయం తెలిసిందే..అయితే రెండో ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ కావడం వలన ఓటమి దారుణంగా అనిపిస్తున్నప్పటికీ, నిజానికి ఫస్ట్ టెస్ట్ లో తొలి రెండు రోజులు టీమిండియానే ఆధిక్యంలో ఉంది...అయితే మ్యాచ్ భారత్ వైపుకు మళ్లుతున్న సమయంలో రహానే తప్పిదానికి కోహ్లీ రన్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా మళ్ళీ మ్యాచ్ లోకి వచ్చింది...

ఈ విషయంపై తాజాగా స్పందించిన తాత్కాలిక కెప్టెన్‌ రహానే.. ‘‘ఆ రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాను. మరేం పర్లేదు అన్నాడు. పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్న సమయంలో అలా జరిగింది. దాంతో మ్యాచ్‌ ఆసీస్‌ చేతిలోకి వెళ్లింది. అది నిజంగా కఠిన సమయం’’ అని చెప్పుకొచ్చాడు..

అయితే ఆ రనౌట్‌ తర్వాత మ్యాచ్‌ మొత్తం ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారిందని విచారం వ్యక్తం చేశాడు. గత అనుభవాల దృష్ట్యా తదుపరి మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు.. ఇక పితృత్వ సెలవు తీసుకున్న కెప్టెన్‌ కోహ్లి స్వదేశానికి పయనం కావడంతో రహానే అతడి స్థానంలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

Tags :
|
|

Advertisement