జైలులో జారిపడిన హీరోయిన్ ...నడుముకు తీవ్ర గాయాలు
By: Sankar Tue, 13 Oct 2020 1:05 PM
శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాగిణి కి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీసీబీ ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆమెతో పాటు హీరోయిన్ సంజన మరియు పలువురు డ్రగ్ పెడ్లర్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ప్రస్తుతం బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆకస్మాత్తుగా జారి పడడంతో నడుముకు, వెన్నముకకు తీవ్ర గాయ్యాలయ్యాయట.రాగిణి ద్వివేది బాత్ రూమ్ లో జారిపడి గాయపడినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కు అనుమతించాలని ఇప్పటికే రాగిణి తరపు న్యాయవాది ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాగిణీ లాయర్ సమర్పించిన పిటీషన్లో తన క్లైంట్ విపరీతమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది. బెంగళూరు సెంట్రల్ జైలు హాస్పిటల్ వారు అందించిన వైద్యం ఆమెకు ఉపశమనం ఇవ్వలేదు. మంచి ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరారు.అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి కూడా అవకాశం కల్పించాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది