రఘురామ కృష్ణరాజు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్:
By: chandrasekar Mon, 12 Oct 2020 3:18 PM
పదే పదే పార్టీ నేతలనూ, ప్రభుత్వాన్నీ
విమర్శిస్తూ కంట్లో నలుసులా తయారైన రఘురామ కృష్ణరాజుపై వైసీపీ శ్రేణులకు ఎప్పటి
నుంచో కోపంగా ఉంది. సదరు ఎంపీ ఎప్పుడు దొరుకుతారా విమర్శలతో ఉతికారేద్దాం అని
ఎదురుచూస్తున్న శ్రేణులు. ఇప్పుడు సరైన సమయం దొరికినట్లు ఫీలవుతున్నాయి. ఎందుకంటే
రఘురామ కృష్ణ రాజుకు సంబంధించినదిగా చెప్పుకుంటున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో
వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన వాళ్లంతా ఎంపీ గారిని టాప్ టు బోటమ్ ట్రోలింగ్తో
వాయించేస్తున్నారు.
రఘురామ కృష్ణరాజు ఓ పబ్లో
అమ్మాయితో నోట్లో బీరు పోయించుకుంటున్నట్లు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్
అవుతోంది. అది నిజమైన ఫొటోలాగే కనిపిస్తున్నా నిజమైనదో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.
ఫొటో చూస్తే మాత్రం ఫొటోషాప్ చేసినట్లుగా కనిపించట్లేదంటున్నారు చాలా మంది. ఆ
యువతి సరిగ్గా ఎంపీ నోట్లోనే మద్యం పోస్తున్నట్లు ఉండగా ఎంపీ కూడా బీర్ నోట్లో పడాలన్నట్లుగా నోరు
తెరిచినట్లు ఉంది. పబ్ లోని ఇతరులు కూడా ఎంపీని చూస్తున్నట్లుగా సీన్ ఉంది. ఎంపీ
కూడా ఆ బీర్ బాటిల్ను టచ్ చేసినట్లుగా ఉంది. అందువల్ల ఇది నిజమైన ఫొటోనే అనే వాదన
బలపడుతోంది.
వరుస ట్రోలింగ్: ఈ ఒక్క
ఫొటోతో రఘురామను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు. రకరకాల
సెటైర్లతో కామెంట్లు రాస్తున్నారు. కొందరు బాహుబలి సినిమాలో పాటను కూడా సెటైర్లలో
మిక్స్ చేశారు. ఈ ఫొటోపై ఎంపీ ఏం చెబుతారో మరి. ఈ రోజుల్లో ఎవర్నైనా ఆకాశానికి
ఎత్తాలన్నా, పాతాళానికి పడేయాలన్నా... సోషల్ మీడియా సరైన ఆయుధంగా
మారింది. వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసూద్ లాంటి వారిని పొగడ్తలతో
ముంచెత్తిన నెటిజన్లు ఇలాంటి యవ్వారాలపై మాత్రం ఫుల్లుగా ఫైరవుతున్నారు.