Advertisement

  • సుశాంత్ కేసులో రియాను సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలు....

సుశాంత్ కేసులో రియాను సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలు....

By: chandrasekar Sat, 29 Aug 2020 5:44 PM

సుశాంత్ కేసులో రియాను సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలు....


ముంబైలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారించిన సంగ‌తి తెలిసిందే. రియా ద‌ర్యాప్తు పూర్త‌వ‌డంతో ఇంటికి తిరిగొచ్చింది. అయితే రియా గెస్ట్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మీడియా అరుస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే సీబీఐ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని అడిగిన కొన్ని ప్ర‌శ్న‌లు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

సుశాంత్ ఇంటిని ఎందుకు వ‌దిలివెళ్లావు..?
సుశాంత్ కోసం మీరు ఏ డాక్ట‌ర్ అపాయింట్ మెంట్ అయినా తీసుకున్నారా..?
సుశాంత్ మృతి గురించి మీకెవ‌రు చెప్పారు..?
మృతి గురించి తెలిసిన వెంట‌నే సుశాంత్ ఇంటికి వెళ్లారా..?
సుశాంత్ మృతి త‌ర్వాత అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు కాల్ చేశావా..?
మార్చురీకి ఎందుకు వెళ్ల‌లేదు..?
సుశాంత్ ఇంట్లో ప‌నిచేస్తున్న సిబ్బందిపై మీరు ఎందుకు ఫైర్ అయ్యారు..?
సుశాంత్ కు మీరేమైనా మందులు ఇచ్చారా..?
సుశాంత్ మ‌ర‌ణానికి దారితీసిన అంశాల‌పై మీరేమనుకుంటున్నారు..?
సుశాంత్ బ్యాంకు కార్డులు మీరెప్పుడైనా వాడారా..?
సీబీఐ అధికారులు ఈ ప్ర‌శ్న‌లతోపాటు ఇంకా చాలా ప్ర‌శ్న‌ల‌ను రియా చక్ర‌వ‌ర్తిని అడిగిన‌ట్టు తెలుస్తోంది.


Tags :

Advertisement