శీతాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్
By: chandrasekar Sat, 05 Sept 2020 1:08 PM
లోక్సభ సచివాలయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ రద్దు తాత్కాలికమేనని స్పష్టంచేసింది. కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు ఎక్కువగా గ్యాలరీల్లో చేరకుండా నిరోధించడం కోసమే వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు లోక్సభ సచివాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉంటుందని తెలిపింది. క్వశ్చన్ అవర్ను ఒకటి రెండు రోజులు నిర్వహించడానికి, ఏకంగా 18
రోజులపాటు నిర్వహించడానికి తేడా ఉందని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది.
ఈ మార్పు కేవలం వర్షాకాల సమావేశాల వరకు మాత్రమేనని, శీతాకాల సమావేశాల్లో మళ్లీ క్వశ్చన్ అవర్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. వర్షాకాల సమావేశాల్లో ప్రతిరోజు
160 అన్స్టార్డ్ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వనుందని పేర్కొంది.