Advertisement

  • పది పరీక్షలు రద్దు చేయాలి ..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు ..పవన్ కళ్యాణ్

పది పరీక్షలు రద్దు చేయాలి ..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు ..పవన్ కళ్యాణ్

By: Sankar Mon, 15 June 2020 7:47 PM

పది పరీక్షలు రద్దు చేయాలి ..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు ..పవన్ కళ్యాణ్

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ డిమాండ్ చేశారు. కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు.తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని, డిగ్రీ, పీజీ ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దు అయ్యాయని పవన్‌ గుర్తు చేశారు.

జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. పరీక్ష పేపర్లు కుదించినా విప్కతర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని తెలిపారు.ఇప్పటికే ఏపీలో ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ప్రజా రవాణా పూర్తి స్థాయి అందుబాటులో లేని ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఈ అంశంపై విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరువాతే ఈ డిమాండ్‌ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నానని.. ప్రభుత్వం విఙ్ఞతతో పిల్లల యోగ క్షేమాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని పవన్‌ తెలిపారు.


Tags :
|

Advertisement