Advertisement

  • కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరికపై పీవీఎన్ మాధవ్ క్లారిటీ

కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరికపై పీవీఎన్ మాధవ్ క్లారిటీ

By: chandrasekar Wed, 07 Oct 2020 10:17 AM

కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరికపై పీవీఎన్ మాధవ్ క్లారిటీ


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి వెళ్తుందంటూ పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అంతేకాక, ఏకంగా కేంద్ర కేబినెట్‌లో వైసీపీకి మూడు మంత్రి పదవులు కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మంగళవారం ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వైసీపీ, టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం పూర్తి స్పష్టతతో ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర కేబినెట్‌లోకి రమ్మన్నారని వైసీపీనే ప్రచారం చేస్తోందనే అనుమానం కలుగుతోందన్నారు. సీబీఐ కేసుల నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు సానుకూలంగా ఉన్నారనేలా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలో జగన్ సర్కారుతోనూ కేంద్రం అలాగే ఉందని మాధవ్ తేల్చి చెప్పారు.

Tags :

Advertisement