Advertisement

  • నారాయణపేట జిల్లాలో విషాదం ..పుట్టి మునిగి నలుగురు గల్లంతు

నారాయణపేట జిల్లాలో విషాదం ..పుట్టి మునిగి నలుగురు గల్లంతు

By: Sankar Mon, 17 Aug 2020 7:01 PM

నారాయణపేట జిల్లాలో విషాదం ..పుట్టి మునిగి నలుగురు గల్లంతు


నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణా నదిని దాటే క్రమంలో ఓ పుట్టి నీటిలో మునిగి నలుగురు గల్లంతయ్యారు. వివరాలు.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం పంచదేవల పహాడ్‌ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు కర్ణాటక రాష్ట్రము రాయచూర్‌లోని కురవాపురం గ్రామానికి వెళ్తుండగా నది దాటే క్రమంలో ఓ పుట్టి నీటిలో మునిగింది.

వీరంతా మక్తల్‌లో కిరాణా సామాన్‌ కొనుగోలు చేసుకొని వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. పసుపుల వద్దకు రాగానే పుట్టి పల్టీ కొట్టడంతో అందులోని 14 మంది నీటిలో మునగగా.. మరో పుట్టిలోని ప్రయాణికులు అప్రమత్తమై 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే నలుగురు నీటిలో గల్లంతు కాగా.. వారిలో ముగ్గురు మహిళలు, ఒక పాప ఉన్నట్లు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే గత నాలుగు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలతో వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి ..సిద్ధిపేట జిల్లాలో కూడా వాగులో ఇన్నోవా కార్ మునిగి కారుతో పాటు ఒక మనిషి గల్లంతు అయ్యాడు..

Tags :
|
|

Advertisement