పూరి జగన్నాథ్ యాత్ర... 700 మంది పూజార్లకు కరోనా టెస్టులు
By: chandrasekar Wed, 24 June 2020 12:00 PM
జగన్నాథ రథయాత్ర
ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర. ఒడిశాలోని పూరీలో ఏటా ఎంతో వైభవంగా దీన్ని
నిర్వహిస్తారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో
పాల్గొంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా భక్తులు ఎవరూ లేకుండా ఈ రథయాత్ర
నిర్వహిస్తున్నారు.
భక్తులు లేకుండా కేవలం
పూజార్లు మాత్రమే నిర్వహించడం చరిత్రలే ఇదే మొదటిసారి అని టెంపుల్ వర్గాలు
చెప్పాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని, అందుకే
భక్తులు లేకుండా నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం
ప్రత్యేక చర్యలు తీసుకుని ఈసారి నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగానే పూరీలో
అధికారులు కర్ఫ్యూ పెట్టారు.
రథాన్ని లాగే 700 మంది
పూజార్లకు కరోనా టెస్టులు కూడా నిర్వహించింది. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం
కేవలం పూరీలోనే ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్నాథుని యాత్రం సందర్భంగా
ప్రధాని మోడీ ఒడిశా ప్రజలకు శభాకాంక్షలు చెప్పారు. అందరికీ మంచి ఆరోగ్యం, మంచి
జరిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు
సంబంధించిన ఫొటోలను ఆ రాష్ట్ర సీఎం నవీన్పట్నాయక్ ట్వీట్ చేశారు. ఆషాఢమాసం
మొదలైన రెండో రోజు ప్రారంభమయ్యే పూరీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం 10 రోజుల
పాటు కొనసాగుతుంది.
పది రోజులు పాటు జరిగే ఈ
రథయాత్రలో లక్షలాది మంది పాల్గొంటారు. ఇంత మంది పాల్గొనే ఏకైక రథయాత్రగా దీనికి
రికార్డ్ ఉంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా దీనికి పేరు ఉంది. వేదాల
ప్రకారం 12వ
శతాబ్దంలో దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.