Advertisement

  • డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ ను అరెస్టు చేసిన పంజాబ్‌ పోలీసులు

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ ను అరెస్టు చేసిన పంజాబ్‌ పోలీసులు

By: chandrasekar Mon, 13 July 2020 2:44 PM

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ ను అరెస్టు చేసిన పంజాబ్‌ పోలీసులు


అంతర్జాతీయ భారత్‌ పాకిస్తాన్‌ సరిహద్దు బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లోని ఓ జవాను డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం మేరకు పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం విలేకరులకు తెలిపారు.

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా నివాసి అయిన జవాన్‌ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ జవాన్‌ జమ్మూ సాంబా సెక్టార్‌లో మోహరించిన బీఎస్ఎఫ్ యూనిట్‌తో అందుబాటులో లేడని సామాచారం.

అతడి నుంచి ఒక పిస్టల్‌, 9ఎంఎం క్యాలిబర్ గన్‌కు చెందిన 80 బుల్లెట్లు, 12 రౌండ్ రైఫిల్‌లోని 2 రౌండ్లు, 2 మ్యాగజైన్స్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా పాకిస్తాన్ సరిహద్దులో 3,300 కిలోమీటర్ల సరిహద్దుకు బీఎస్‌ఎఫ్‌ కాపలాగా ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement