Advertisement

  • చెన్నై చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమణ

చెన్నై చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమణ

By: chandrasekar Mon, 02 Nov 2020 10:02 AM

చెన్నై చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమణ


ఐపీల్ 2020 లో ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో చెన్నై చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించింది. ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు షాక్‌ తగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌లతో పాటు రాణించడంతో చెన్నై వరుసగా మూడో మ్యాచ్‌ నెగ్గింది. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ 6 విజయాలతో 12 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు దూరమైంది. ఇప్పటికే ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన చెన్నై హ్యాట్రిక్‌ విజయాలతో సీజన్‌ను గెలుపుతో ముగించింది. పంజాబ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (62 నాటౌట్‌ 49 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకానికి తోడు డుప్లెసిస్‌(48), అంబటి రాయుడు(30 నాటౌట్‌) రాణించడంతో చెన్నై అలవోకగా విజయాన్ని అందుకుంది.

చెన్నై చేతిలో టాస్ వోడి మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆఖర్లో దీపక్‌ హుడా(63 నాటౌట్‌: 30 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్‌ పోరాడే స్కోరు సాధించింది. లుంగి ఎంగిడి(3/39) నిప్పులు చెరగడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. మొదట పవర్ ప్లే లో మంచి స్కోర్ చేసినా తరువాత వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్ చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(29), మయాంక్ అగర్వాల్‌(26) మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌(12), నికోలస్‌ పూరన్‌(2), మన్‌దీప్‌ సింగ్‌(14) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, తాహిర్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కానీ చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్ నిలకడగా బాటింగ్ చేయడంతో చెన్నై అలవోకగా విజయాన్ని సాధించింది.

Tags :
|

Advertisement