నీటి పంపకాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం
By: chandrasekar Wed, 19 Aug 2020 09:52 AM
నీటి పంపకాల పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యాణాతో నీటి పంపకాల అంశంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి గట్టి హెచ్చరికలు పంపారు. సట్లేజ్ -
యమునా లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే పంజాబ్ అగ్నిగుండంలా మారుతుందని అమరీందర్ సింగ్ హెచ్చరించారు.
హర్యాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని అయన వ్యాఖ్యానించారు. మంగళవారం, ఆగస్టు 18 న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మరియు హర్యాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశం తర్వాత హర్యాణా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి కావాలనే వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో ఈ సమస్యపై మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ మరియు హర్యానాల మధ్య నెలకొన్న నీటి పంపకాలు త్వరగా ఒక కొలిక్కి రావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.