Advertisement

  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఫైర్ అయిన పంజాబ్ సీఎం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఫైర్ అయిన పంజాబ్ సీఎం

By: Sankar Thu, 03 Sept 2020 7:03 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఫైర్ అయిన పంజాబ్ సీఎం


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లోని ఆప్ కార్యకర్తలందరూ ఆక్సిమీటర్ లు తీసుకుని జనాల్లోకి వెళ్లి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను కొలవమని తద్వారా కరోనా సోకినవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు.

దాంతో పంజాబ్ సీఎం అమరిందర్ తమ రాష్ట్రం విషయంలో కేజ్రీవాల్ తల దూర్చవద్దని మండిపడ్డారు. మీ ఆక్సీమీటర్లు మాకు అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ కార్యకర్తలు జనాలను ఆస్పత్రికి వెళ్లనియ్యకుండా చేస్తున్నారని అన్నారు. వారంతట వారే కరోనా టెస్టులు చేసుకునేలా చేస్తున్నారని... ముందు మీవారికి కళ్లెం వేయాలని సూచించారు.

కరోనా ను జయించడానికి రాష్ట్రప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తోందని అన్నారు. కేజ్రీవాల్ ఆక్సిమీటర్ లు తీసుకుని జనాల్లోకి వెళ్లమని చెప్పటం తమ ప్రభుత్వాన్ని కించపరచడమే అవుతుందన్నారు. తమ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చవద్దని అన్నారు.

Tags :
|
|
|
|

Advertisement