పుజారాలా ఎవరు ఆడబోతారో చూడాలి...
By: chandrasekar Fri, 11 Dec 2020 11:18 PM
టీమిండియా మాజీ ఆటగాడు
రాహుల్ ద్రవిడ్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నటెస్టు సిరీస్ను ఉద్దేశించి
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు. ఆసీస్తో జరగబోయే నాలుగు టెస్టు
మ్యాచ్ల సిరీస్లో ఈసారి పుజారా ఎవరు కానున్నారనేది చూడాల్సి ఉందని
పేర్కొన్నాడు. 'ఈసారి ఆసీస్తో జరగబోయే టెస్టు సిరీస్లో ఎవరు
పుజారాలాగా అద్భుత ప్రదర్శన చేస్తారో చూడాలి.
రెండు సంవత్సరాల క్రితం
ఆసీస్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో పుజారా అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు.
మూడు సెంచరీలు కలుపుకొని 521 పరుగులు సాధించాడు. వేరే బ్యాట్స్మెన్ ఆ పరుగులు
చేస్తారా చూడాలి. అదే విధంగా టీమిండియా బౌలింగ్పై పూర్తి నమ్మకం ఉంది.
ప్రతీసారి ఒక సిరీస్లో
బ్యాట్స్మన్కు 500 పరుగులు చేయడం సాధ్యం కాదు. కానీ బ్యాట్స్మన్
కొట్టడం స్టార్ట్ చేస్తే బౌలర్లకు మాత్రం కష్టమే అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఐదు రోజుల్లో టీమిండియా
బౌలర్లకు 20 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు బ్యాట్స్మన్లకు
అలా వీలు పడదు.