Advertisement

పుదుచ్చేరి సీఎంకు కరోనా నెగెటివ్

By: Sankar Mon, 29 June 2020 3:46 PM

పుదుచ్చేరి సీఎంకు కరోనా నెగెటివ్



కేంద్రపాలిత ప్రాంతం పుదుచేర్రిలో కరోనా అంతకంతకు విజృంభిస్తుంది ..ఇటీవలే ఒక మాస్క్ ల పరిశ్రమలో కరోనా రావడంతో పుదుచేర్రి వాసులు ఉలిక్కిపడ్డారు ..ఇక ఆ తర్వాత సీఎం వద్ద పనిచేసే వ్యక్తి యొక్క తండ్రికి రావడంతో సీఎం తో పాటుగా అయన కార్యాలయంలో పనిచేసే వారికి కరోనా పరీక్షలు చేసారు ..సీఎం మరియు ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు 51 మందికి పీటీ-పీసీఆర్ పరీక్షలు చేశారు.

అయితే సీఎం నారాయణస్వామితో పాటు 51 మంది సీఎం కార్యాలయ ఉద్యోగులకు కరోనా నెగిటివ్ అని రిపోర్టులో వచ్చిందని పుదుచ్చేరి కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరు మోహన్ కుమార్ చెప్పారు. అయినా ముందు జాగ్రత్తగా సీఎం నారాయణస్వామితోపాటు ఉద్యోగులకు వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించామని డైరెక్టరు చెప్పారు. సీఎం వద్ద పనిచేస్తున్న 32 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించామని, వారి నివేదికలు ఇంకా రాలేదని మోహన్ కుమార్ చెప్పారు. సీఎం ఏప్రిల్ నెలలోనూ స్వాబ్ పరీక్ష చేయించుకున్నారు..

Tags :

Advertisement