Advertisement

కరోనాకు టాలీవుడ్ లో నిర్మాత బలి

By: chandrasekar Mon, 31 Aug 2020 6:06 PM

కరోనాకు టాలీవుడ్ లో నిర్మాత బలి


కరోనా వైరస్ ప్రపంచాన్ని అందరినీ వణికిస్తూ ప్రాణాలు తీస్తోంది. టాలీవుడ్‌లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. తాజాగా నిర్మాత బొగారి లక్ష్మీనారాయణ కరోనా కారనంగా కన్నుమూసారు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈయన తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఈయన ఆరోగ్యం విషమించడంతో మరణించారు. సికింద్రాబాద్‌లోని యశోదాలో ఈయన కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు.

ఆగస్ట్ 30 సాయంత్రం ఉన్నట్లుండి ఈయన ఆరోగ్యం విషమించింది. దాంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎదురీతతో పాటు మరికొన్ని సినిమాలు కూడా లక్ష్మీనారాయణ నిర్మించారు.

Tags :
|

Advertisement