ప్రియుడి మోజులో పడి భర్తని చంపేసిన భార్య
By: chandrasekar Mon, 13 July 2020 11:16 AM
ప్రియుడి మోజులో పడి
కట్టుకున్న భర్తని అమానుషంగా హత్య చేసింది. తన రాసలీల వ్యవహారం ఎక్కడ
బయటపడుతుందోనని హైడ్రామాకు తెరతీసింది. తన భర్త కరోనాతో చనిపోయాడంటూ దొంగేడుపు
అందుకుంది. ఆమె ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో
కథ అడ్డం తిరిగింది. చివరికి ప్రియుడితో రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణ ఘటన దేశ రాజధాని
ఢిల్లీలో చోటుచేసుకుంది. ఒడిశాకి చెందిన శరత్ దాస్(45)కి అనిత దాస్తో పదిహేనేళ్ల
కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. ఢిల్లీకి వలసొచ్చిన కుటుంబం అనిత
బంధువులతో కలసి నోయిడాలో నివాసముంటోంది. ఈ క్రమంలో అనితకి అదే ప్రాంతానికి చెందిన
సంజయ్(32) అనే
వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహతర సంబంధానికి దారితీసింది. భర్తకి తెలియకుండా ప్రియుడితో
రహస్యంగా రాసలీలలు సాగించేది.
కొన్నాళ్లకి ప్రియుడితో
భార్య శృంగార లీలల వ్యవహారం భర్తకి తెలిసిపోయింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు
జరుగుతున్నాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనిత
ప్రియుడితో కలసి భర్త హత్యకి ప్లాన్ చేసింది. నిద్రిస్తున్న సమయంలో భర్తని
చంపేయాలని నిర్ణయించుకుని ప్రియుడికి కబురుపెట్టింది. ఇద్దరూ కలసి దుప్పటితో
ఊపిరాడకుండా చేసి శరత్ని అమానుషంగా చంపేశారు. అనంతరం కంత్రీ భార్య కొత్త డ్రామాకు
తెరతీసింది. తన భర్త కరోనాతో చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ జబ్బు
పడని వ్యక్తికి కరోనా సోకిందనడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం
అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
మృతదేహాన్ని పరిశీలించి భార్యను ఆరా తీశారు. కరోనా టెస్టింగ్ ఫలితాలు చూపించాలని
పోలీసులు అడగడంతో పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానం రేగింది.
పోస్టుమార్టం రిపోర్ట్లో శరత్ని హత్య చేశారని తేలడంతో పోలీసుల అనుమానాలు
నిజమయ్యాయి. భార్యని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజాలు
కక్కేసింది. కంత్రీ భార్య రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి
అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు ఒప్పేసుకోవడంతో
నిందితులను అరెస్టు చేసి జైలు లో వేశారు.