బిహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న ప్రధాని...?
By: chandrasekar Wed, 14 Oct 2020 8:36 PM
ఈ నెల 22న
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నట్లు
సమాచారం. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని తొలి ఎన్నికల ర్యాలీలో పాల్గొని
ప్రసంగించనున్నారు. బక్సర్, జెహానాబాద్, రోహ్తాస్, భాగల్పూర్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని
ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
పీఎంవో నుంచి అనుమతి వచ్చిన
వెంటనే ర్యాలీ, సభా ఏర్పాట్లు, పాల్గొనే నాయకులకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయనున్నట్లు
ఆ పార్టీ నాయకులు తెలిపారు. పార్టీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్ ప్రధాని
మోదీనే అని బీజేపీ భావిస్తుంది. దీన్ని ఓట్లుగా మలుచుకునేందుకు ఆశగా ఎదురు
చూస్తోంది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మూడు దశల్లో
పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 28,
నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ను నిర్వహించి నవంబర్ 10న ఫలితాలను
ప్రకటించనున్నారు.