ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అత్యున్నత పురస్కారం
By: chandrasekar Tue, 22 Dec 2020 7:39 PM
భారత-అమెరికా ద్వైపాక్షిక
స్నేహాన్ని పెంపొందించినందుకు ప్రధాని మోడీకి అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మక
"లెజియన్ ఆఫ్ మెరిట్" అవార్డును ప్రదానం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను
తదుపరి స్థాయికి తీసుకెళ్లినందుకు ఈ అవార్డును ప్రధాని నరేంద్ర మోడీకి అధ్యక్షుడు
ట్రంప్ అందజేసినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ బ్రయాన్ ఒక ప్రకటనలో
పేర్కొన్నారు.
ఈ అవార్డును ప్రధాని మోడీ
తరఫున అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సిద్ధు అందుకున్నారు. ఈ అవార్డును
గతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు అందజేశారు. ఈ
అవార్డు ప్రధానమంత్రి నాయకత్వాన్ని మరియు భారతదేశ అంతర్జాతీయ నాయకత్వానికి
ఆయనకున్న నిబద్ధతను, భారతదేశం మరియు అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ
శాంతి మరియు అభివృద్ధి కోసం ఆయన విధానాలను గుర్తిచిందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ
శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.