నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ ..
By: Sankar Tue, 30 June 2020 12:00 PM
ఈ రోజు అనగా మంగళవారం నాడు భారత ప్రధాని సాయంత్రం నాలుగు గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు ..దీనితో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ..కరోనా కేసుల తీవ్రతరం అవుతున్న దశలో అలాగే ఇండియా చైనా మధ్య సంఘర్షణలు జరుగుతున్న దశలో మోడీ మాట్లాడే దాని గురించి అందరు ఎదురుచూస్తున్నారు ..ఇప్పటికే చైనా కు చెందిన 59 యాప్స్ ను ప్రభుత్వం నిషేదించింది..
మరోవైపు దేశంలోరోనా వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కంటెయిన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి అన్లాక్ 2.0మార్గదర్శకాలు విడుదల చేసింది కంటెయిన్మెంట్ జోన్లు మినహా ఇతర జోన్లలో పలు కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు జులై 31 వరకు మూసివేయాలని సూచించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్పూల్స్పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. నిషేధం కొనసాగుతున్న ఆయా అంశాలకు సంబంధించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు.. టిక్టాక్, యూసీ బ్రైజర్, హలో సహా 59 యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని ఎటువంటి ప్రకటన చేస్తారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు ..