Advertisement

  • ఎందరో త్యాగాల ఫలితమే ఈ రామ్ మందిర్ నిర్మాణం ..ప్రధాని నరేంద్ర మోడీ

ఎందరో త్యాగాల ఫలితమే ఈ రామ్ మందిర్ నిర్మాణం ..ప్రధాని నరేంద్ర మోడీ

By: Sankar Wed, 05 Aug 2020 1:52 PM

ఎందరో త్యాగాల ఫలితమే ఈ రామ్ మందిర్ నిర్మాణం ..ప్రధాని నరేంద్ర మోడీ



అయోధ్య లో రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించారు .ముందుగా జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగం ప్రారంభించిన మోడీ మాట్లాడుతు దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అన్నారు.కోటను కోట్ల హిందువులకు ఈ ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైంది ...వందల ఏళ్ళ నిరీక్షణ ఈ రోజు ఫలించింది అని అన్నారు ప్రధాని మోడీ ..

ఈ రోజు భారత దేశం మొత్తం రామమయం అయింది ..జై శ్రీ రామ్ నినాదాలు దేశం లోనే గాక ప్రపంచము మొత్తం వినిపిస్తున్నాయి అన్నారు ..దశాబ్దాల పాటు రామ్ లెల్ల ఆలయం టెంట్లోనే కొనసాగింది ..దేశ ప్రజల సంకల్ప బలంతోనే రామ మందిర నిర్మాణం సాధ్యం అవుతుంది అన్నారు మోడీ

భారత దేశం యొక్క మర్యాద శ్రీరాముడు అని అన్నారు మోడీ ..ఈ రోజు ఇక్కడ భూమి పూజకు వచ్చే ముందు నేను హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాను ..ఎందుకంటే రాముడికి హనుమంతుడు కంటే గొప్ప భక్తుడు ఎవరు లేరు ..హనుమంతుడి ఆశిశులతో నేను ఈ రోజు భూమి పూజను ప్రారంభించాను అని అన్నారు మోడీ ..దేశం కోసం అనేక మందిప్రాణ త్యాగాలు చేసినట్లే , రామ మందిరం కోసం అనేక ప్రాణ త్యాగాలు జరిగాయి ..వారి ప్రాణ త్యాగాలతోనే ఈ రోజు మనం ఈ మందిర్ నిర్మాణం జరుపుకుంటున్నాం అన్నారు మోడీ ..130 కోట్ల మందో భారతీయుల తరుపున నేను వారందరికీ వందనం చేస్తున్న అన్నారు ప్రధాని..

Tags :
|

Advertisement