Advertisement

  • వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ

వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ

By: chandrasekar Thu, 24 Sept 2020 10:09 AM

వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ


వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుమల టీటీడీ అన్నమయ్య భవన్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర కరోనా వివరాలు తెలుసుకున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి సీఎం జగన్‌ వివరిస్తున్న క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నాకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలుగుతోంది’’ అన్నారు. సీఎం జగన్‌ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం ఉండడంతో ప్రధాని ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయమని ప్రధాని మోదీ సీఎం జగన్ను అభినందించారు.

ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ప్రజలకు త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయని, ఇదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Tags :

Advertisement