ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
By: chandrasekar Fri, 09 Oct 2020 09:35 AM
ఇన్వెస్ట్ ఇండియా
సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అయన పలు కీలక విషయాలు
ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇన్వెస్ట్ ఇండియా
సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్న
ప్రధాని భారత దేశంలో కేనడా వ్యాపారావేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ని అనుకూలమైన
అంశాలు ఉన్నాయని తెలిపారు.
ఇన్వెస్ట్ ఇండియా
సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడిన విషయాల్లో కీలకమైన అంశాలు:
* ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో ఒక కామన్ విషయం ఉంది.
ఇక్కడ పెట్టుబడిని పెట్టేందుకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వ్యక్తులు ఉన్నారు.
* ఫార్మా రంగంలో భారతదేశం వాటా, పాత్ర
కీలకం. ఇప్పటి వరకు మేము 150 దేశాలకు మందులు, ఇతర వైద్యోపకరణాలు సరఫరా చేశాం.
* భారత్-కెనడా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు అనేవి
సమాంతరమైన ప్రజాస్వామ్య విలువలపై, ఇరు పక్షాల సహజ ఆసక్తులపై ఆధారపడి ఉన్నాయి.
* నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను ఒక
దేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఏం ఆలోచిస్తారు? ఆ
దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? రాజకీయంగా అలజడులు లేని దేశమా కాదా? పెట్టుబడికి
అనుకూలంగా ఉన్న దేశమా కాదా? ఆ దేశంలో తగిన స్కిల్స్ ఉన్న మానవ వనరులు ఉన్నాయా
లేదా? మీ
మదిలో మెదిగే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకటే సమాధానం అదే భారత దేశం అని అన్నారు.
* భారత్-కెనాడా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు
అనేవి మన బంధాల్లో భాగంగా జరిగేవి మాత్రమే.
* కోవిడ్-19 సమస్య తగ్గిన తరువాత ఎన్నో సమస్యలు కంటిముందు
కనిపిస్తాయి. అందులో చాలా వాటికి పరిష్కారం భారత్ వద్దే ఉంటుంది. అంటే సప్లై
చేయిన్, పీపీఈ
కిట్స్ వంటి విషయంలో భారత్ ప్రపంచానికి ఆధారంగా మారింది.
* ఈ ఏడాది మార్చి-జూన్ మధ్యలో వ్యవసాయ ఎగుమతులు 23 శాతం
పెరిగాయి అని తెలిపారు.
భారతదేశం అన్ని రంగాల్లో
ఆర్ధికంగా దేసుకెళుతున్నట్లు తెలిపారు.