Advertisement

  • డిసెంబర్ 4న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ విర్చువల్ కాన్ఫరెన్స్

డిసెంబర్ 4న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ విర్చువల్ కాన్ఫరెన్స్

By: chandrasekar Wed, 02 Dec 2020 09:25 AM

డిసెంబర్ 4న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ విర్చువల్ కాన్ఫరెన్స్


కరోనా మహమ్మారి పై అన్నీ రాష్ట్రాల స్థితిగతులు మరియు తీసికోవలసిన చర్యలపై ప్రధాని సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న దేశంలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో విర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశంలో కరోనా స్థితిగతులు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

వైరస్ వ్యాప్తి పై మరియు వాక్సిన్ ప్రక్రియ అమలు చేయుటకు మోదీ అధ్యక్షతన శుక్రవారం, డిసెంబర్‌ 4 న ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనుంది. దేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభం తర్వాత ఇది రెండో అఖిలపక్ష భేటీ కావడం గమనార్హం.

గత వారం వాక్సిన్ తయారీ కంపనీలను ప్రధాని సందర్శించిన విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయోగాలు కీలక దశకు చేరుకోకున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాక్సిన్ సరఫరా మరియు కరోనా వైరస్ గురించి సమీక్షించనున్నారు.

Tags :

Advertisement