భూమి తగాదాలో పూజారి సజీవ దహనం
By: chandrasekar Fri, 09 Oct 2020 5:55 PM
భూమి తగాదాలో పెట్రోలు
పోసి పూజారిని సజీవ దహనం చేశారు. రాజస్తాన్ లోని కరౌలీ జిలాల్లో
ఈ దారుణ సంఘటన జరిగింది. 50 ఏళ్ళ
పూజారిని దుండగులు పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈయనను బాబూలాల్ వైష్ణవ్ గా
గుర్తించారు. 5.2 ఎకరాల భూమికి సంబందించిన వివాదమే ఈ ఘోరానికి కారణమని
తెలుస్తోంది.
ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్
ట్రస్టుకు చెందిన ఈ భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని
ప్రభుత్వం పూజారుల మనుగడకు జెటాయించింది. ఇక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని
వైష్ణవ్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని అగ్ర వర్ణ మీనా కులస్థుల కన్ను
ఈ భూమిపై పడింది.
భూమి ఆక్రమణలో భాగంగా
వారు ఆ ప్రాంతంలో షెడ్ నిర్మించగా వైష్ణవ్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ
పెద్దలవరకు ఈ మద్దిస్తం వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో
అగ్రవర్ణ కులస్థులు కక్ష గట్టి వైష్ణవ్ పై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. వీరిపై
కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు.