Advertisement

భూమి తగాదాలో పూజారి సజీవ దహనం

By: chandrasekar Fri, 09 Oct 2020 5:55 PM

భూమి తగాదాలో పూజారి సజీవ దహనం


భూమి తగాదాలో పెట్రోలు పోసి పూజారిని సజీవ దహనం చేశారు. రాజస్తాన్ లోని కరౌలీ జిలాల్లో

ఈ దారుణ సంఘటన జరిగింది. 50 ఏళ్ళ పూజారిని దుండగులు పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈయనను బాబూలాల్ వైష్ణవ్ గా గుర్తించారు. 5.2 ఎకరాల భూమికి సంబందించిన వివాదమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది.

ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ట్రస్టుకు చెందిన ఈ భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం పూజారుల మనుగడకు జెటాయించింది. ఇక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని వైష్ణవ్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని అగ్ర వర్ణ మీనా కులస్థుల కన్ను ఈ భూమిపై పడింది.

భూమి ఆక్రమణలో భాగంగా వారు ఆ ప్రాంతంలో షెడ్ నిర్మించగా వైష్ణవ్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ పెద్దలవరకు ఈ మద్దిస్తం వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో అగ్రవర్ణ కులస్థులు కక్ష గట్టి వైష్ణవ్ పై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు.

Tags :
|
|
|

Advertisement