Advertisement

  • తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

By: Sankar Sun, 27 Sept 2020 10:10 PM

తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర


కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈబిల్లులు చట్టబద్దం అయ్యాయి.

ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్నా రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం విశేషం. జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. కాగా, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు బిల్లులను ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుపై రాజ్యసభలో పెద్ద రగడ జరిగింది.

రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని కేంద్రం చెప్తున్నది. అయితే, ఈ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

Tags :

Advertisement