Advertisement

  • రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ..

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ..

By: Sankar Mon, 23 Nov 2020 9:22 PM

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ..


శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు కూడా తిరుమలను సందర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేపు రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా కూడా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు చేయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

రేపు ,మధ్యాహ్నం 1:05 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతి 1: 40 గంటలకు తిరిగి పద్మావతి అతిధి గృహం చేరు​కోనున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత విరామం తీసుకున్న అనంతరం 3:40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags :

Advertisement