Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి నమూనాలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి నమూనాలు సిద్ధం

By: chandrasekar Thu, 20 Aug 2020 1:47 PM

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి నమూనాలు సిద్ధం


పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అడ్డంకులు తొలగిపోయిన వెంటనే పట్టాలను లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించింది. పేదలకు ఇచ్చే స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి మోడల్ హౌస్‌లను సిద్ధం చేసింది. వైఎస్సార్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద నిర్మించిన మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. తాడేపల్లి బోట్‌ హౌస్‌ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్‌ హౌస్‌ను నిర్మించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పేదలకు కేటాయించే సెంటు స్థంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, వరండాలతో కూడిన ఈ నిర్మాణానికి రూ.2లక్షల 50వేలు ఖర్చు అవుతుంది. అత్యంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

రెండు రకాల మోడ‌ల్ హౌస్‌ల‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వీటిపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.సెంటు స్థలంలో ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో నమూనాలను సిద్ధం చేసింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమంది పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాకముందే పంపిణీ చేయాలనుకుంది. ముందు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించగా అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా వేశారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. తర్వాత మళ్లీ కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు వైఎస్ జయంతి రోజు ఆ తర్వాత ఆగస్టు 15న ఇవ్వాలనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా పడింది.

Tags :

Advertisement