యాదాద్రి జిల్లాలో దారుణం ..లారీ ఢీకొని ట్రాక్టర్ లో ఉన్న గర్భిణీ మహిళ మృతి
By: Sankar Sun, 30 Aug 2020 8:19 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గర్భిణిని బలితీసుకుంది. అప్పటువరకు అందరితో ఉల్లాసంగా పనిచేసుకుంటూ ఉన్న ఆ మహిళ అకస్మాత్తుగా మరణించడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి
ఈ విషాద ఘటన యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి వద్ద జరిగింది. ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో భాగంగా పలువురు జాతీయ రహదారిపై ట్రాక్టర్ నిలిపి మట్టి వేస్తున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన లారీ ట్రాక్టర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పనిలో నిమగ్నమై ఉన్న గర్భిణి అక్కడికక్కడే మరణించింది. మరో మహిళకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన పలువురిని వెంటనే జిల్లా కేంద్రం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఊహించని ప్రమాదంతో కూలీలు షాక్కి గురయ్యారు. గర్భిణి మరణంతో తీవ్ర విషాదం నెలకొంది