Advertisement

  • నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..నిండు గర్భిణీ మృతి..

నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..నిండు గర్భిణీ మృతి..

By: Sankar Tue, 22 Sept 2020 11:04 AM

నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..నిండు గర్భిణీ మృతి..


తెలంగాణలో గత కొన్నిరోజులుగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు.

తాజాగా నిజామాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రెండు బైకులు పరస్పరం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 8 నెలల గర్భవతి అయిన రజిత అనే మహిళ, తన సోదరుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి బయల్దేరింది. అయితే మార్గం మధ్యలోనే ఎదురుగా వస్తున్న మరో బైక్ రజిత ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రజిత మృతి చెందిది. రెండు బైకులు నడుపుతున్న ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Advertisement