Advertisement

  • బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

By: Sankar Mon, 21 Dec 2020 2:08 PM

బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్


తమకు పట్టులేని రాష్ట్రాలలో ఎలాగయినా పట్టు సాధించాలని విశ్వా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ ..ఇప్పటికే తెలంగాణాలో పట్టు సాధించినట్లే కనిపిస్తుంది..ఇక తమ తదుపరి లక్ష్యం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతుంది..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో అధికార తృణమూల్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, నేతలు భారీగా చేరారు. అది ఆరంభం మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఈ సందర్భంగా షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాలీలు మమత పాలనపై ఎంత ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 200 స్థానాల్లో విజయం సాధిస్తుందని షా జోష్యం చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం మమత ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదని అర్ధం వచ్చేలా పీకే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దాటదని, ఒక వేళ అదే జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు.

Tags :
|

Advertisement