డీప్ కోమాలో ప్రణబ్ ముఖర్జీ.. దేవుడిని ప్రార్ధించాలని కోరిన ప్రణబ్ కుమారుడు
By: Sankar Mon, 31 Aug 2020 4:38 PM
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందంటున్నారు ఆయనకు చికిత్స చేస్తున్న ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు..
ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని.. కానీ అతని కీలకమైన పారామీటర్స్ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు.