Advertisement

హైదరాబాద్ లో పెరుగుతున్న పోస్ట్ కరోనా కేసులు

By: Sankar Sun, 08 Nov 2020 7:48 PM

హైదరాబాద్ లో పెరుగుతున్న పోస్ట్ కరోనా కేసులు


కరోనా వచ్చిన తగ్గిన వారిని ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలు టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 300 పోస్ట్ కోవిడ్ కేసుల రోగులు చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో ప్రస్తుతం నగర ఆసుపత్రులలో వందలాది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు.

ఇప్పుడు చాలా మంది రోగులు ఇంటిలోనే క్వారెంటైన్ అయ్యి తెలిసిన మందులతో ఈ కరోనాని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారి కంటే ఎక్కువగా ఆసుపత్రులలో చేరి చికిత్స పొందిన వారికే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఓ కార్పోరేట్ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఈ కరోనా మొదట్లో ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేవారని కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా కేసులు కాంప్లికేట్ అయితేనే చాలా ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు కొన్ని పెద్దగా ఇబ్బంది కల్గించకున్నా వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యలలో పక్షవాతం, గుండెపోటు మరియు డయాలసిస్, అలానే మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ లాంటివి ఉన్నాయి.

వైరస్ వచ్చి తగ్గిన 15 రోజుల నుండి 3 నెలల వరకు కనిపించే ఈ తీవ్రమైన పోస్ట్-కోవిడ్ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే, కరోనా వైరస్ వలన రక్త నాళాల గడ్డకట్టుకు పోయి ఈ ఇబ్బందులు తలేత్తుతున్నట్టు చెబుతున్నారు.ఈ వైరస్ వలన వస్తున్న పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మొదటి 10 రోజుల్లో హాజరు కాకపోతే అది అలాగే ఉంటుందని చెబుతున్నారు.

Tags :

Advertisement